17.7 C
Hyderabad
Tuesday, January 20, 2026
HomeNationPatanjali: మీ తప్పు క్షమాపణ చెపితే పోయేది కాదు, మీకు ఆ బాధ తెలియాలి: సుప్రీం...

Patanjali: మీ తప్పు క్షమాపణ చెపితే పోయేది కాదు, మీకు ఆ బాధ తెలియాలి: సుప్రీం కోర్ట్

నయం చేయలేని వ్యాధులకు శాశ్వత నివారణ అంటూ తప్పుదోవ పట్టించే ప్రకటనలకు సంబంధించిన ధిక్కార విచారణలో పతంజలి వ్యవస్థాపకులు రామ్‌దేవ్ మరియు బాలకృష్ణలు దాఖలు చేసిన రెండవ “బేషరతు క్షమాపణ”ను సుప్రీంకోర్టు బుధవారం తిరస్కరించింది.

పతంజలితో కుమ్మక్కైనందుకు, తప్పుదోవ పట్టించే ప్రకటనలను కొనసాగించినందుకు కంపెనీపై చర్యలు తీసుకోవడంలో విఫలమైనందుకు, ఉత్తరాఖండ్ రాష్ట్ర డ్రగ్ లైసెన్సింగ్ అథారిటీ అధికారులను న్యాయమూర్తులు హిమా కోహ్లీ, అహ్సానుద్దీన్ అమానుల్లాతో కూడిన ధర్మాసనం హెచ్చరించింది. 

తప్పుదోవ పట్టించే ప్రకటనలు ఇకపై  కొనసాగించకూడదు అని కోర్టు చెప్పిన మర్నాడే (నవంబర్ 22న) రామ్‌దేవ్ విలేకరుల సమావేశం నిర్వహించారు. అంతే కాదు, వార్తాపత్రికలలో పూర్తి పేజీ ప్రకటనలను కొనసాగించింది. మీడియాలో తప్పుదారి పట్టించే ప్రకటనలను కొనసాగించినందుకు పతంజలిపై ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) దాఖలు చేసిన ధిక్కార పిటిషన్‌ను కోర్టు విచారించింది.

క్షమాపణ చెప్పడం సరిపోదు. కోర్టు ఆదేశాలను ఉల్లంఘించినందుకు మీరు పరిణామాలను అనుభవించాలి. ఈ కేసులో మేము ఉదారంగా ఉండకూడదనుకుంటున్నాము, ”అని బెంచ్ పేర్కొంది:

రామ్‌దేవ్ మరియు పతంజలిపై చర్య తీసుకోవడంలో నిర్లక్ష్య ధోరణి అవలంభించిన ఉత్తరాఖండ్ రాష్ట్ర లైసెన్సింగ్ అథారిటీ పై కోర్టు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది.

ఓ లుక్కేయండి

తాజా వార్తలు

Join WhatsApp Channel