గ్వాలియర్: లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ప్రతీ వేదికపై దేశ గౌరవాన్ని తగ్గించేలా మాట్లాడుతున్నారని కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా మండిపడ్డారు. ఇలా చేయడం వల్ల అటు కాంగ్రెస్ పార్టీకి గానీ, ఇటు రాహుల్ గాంధీకి గానీ ఎలాంటి ప్రయోజనం ఉండదని ఆయన హితవు పలికారు.

