22.2 C
Hyderabad
Wednesday, February 4, 2026
HomeWorldకొత్త రూపు సంతరించుకుంటున్న భారత్-ఇజ్రాయెల్ బంధం… మారుతున్న గ్లోబల్ ఈక్వేషన్స్!

కొత్త రూపు సంతరించుకుంటున్న భారత్-ఇజ్రాయెల్ బంధం… మారుతున్న గ్లోబల్ ఈక్వేషన్స్!

ప్రపంచ రాజకీయ ముఖచిత్రం వేగంగా మారుతోంది. ఇన్నాళ్లు అమెరికా ఆధిపత్యంతో నడిచిన ‘ఏకధృవ ప్రపంచం’ కనుమరుగై, బహుళ ధృవ ప్రపంచం ఆవిష్కృతమవుతోంది. ఈ కీలక తరుణంలో భారత్ మరియు ఇజ్రాయెల్ దేశాల మధ్య బంధం కేవలం ద్వైపాక్షిక మిత్రత్వంగానే కాకుండా, కొత్త ప్రపంచానికి ఒక దిక్సూచిగా మారుతోందని తాజా అంతర్జాతీయ విశ్లేషణలు వెల్లడిస్తున్నాయి.

గతంలో భారత్ తన విదేశాంగ విధానంలో “నాన్-అలైన్డ్” (తటస్థ) వైఖరిని అవలంబించేది. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. అమెరికా ఆధిపత్యం తగ్గుముఖం పట్టడం, చైనా ప్రాబల్యం పెరగడం వంటి పరిణామాల మధ్య.. భారత్ మరియు ఇజ్రాయెల్ వంటి “మిడిల్ పవర్స్” తమకంటూ ఒక ప్రత్యేక వ్యూహాన్ని రల్చుకుంటున్నాయి. రెండు దేశాలు తమ భద్రత కోసం కేవలం అగ్రరాజ్యాలపై ఆధారపడకుండా, తమ రక్షణ సామర్థ్యాన్ని స్వయంగా పెంచుకుంటున్నాయి. ఇండియా, ఇజ్రాయెల్, యూఏఈ మరియు అమెరికా కలిసి ఏర్పాటు చేసిన ఈ కూటమి.. పశ్చిమాసియాలో కొత్త శక్తిగా ఎదుగుతోంది. ఇది పాత ప్రపంచపు సమీకరణాలను చెరిపేస్తోందని విశ్లేషకులు భావిస్తున్నారు.

ఈ నెలలో భారత్-ఇజ్రాయెల్ సంబంధాల్లో కీలక ముందడుగులు పడ్డాయి. ఈ వారం ఢిల్లీ మరియు జెరూసలేం మధ్య జరిగిన చర్చలు ఈ బంధాన్ని మరింత బలోపేతం చేశాయి. ఇరు దేశాల మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం కోసం ప్రాథమిక చర్చలు ఊపందుకున్నాయి. ఇది పూర్తయితే రెండు దేశాల ఆర్థిక వ్యవస్థలకు పెద్ద ఊతం లభిస్తుంది. ఇటీవలే భారత విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ మరియు ఇజ్రాయెల్ విదేశాంగ మంత్రి గిబియోన్ సార్ కలిసి 2026 జాయింట్ వర్కింగ్ ప్లాన్ ను ఆమోదించారు. ఇది రక్షణ, వ్యవసాయం, మరియు సైబర్ సెక్యూరిటీ రంగాల్లో సహకారాన్ని విస్తృతం చేస్తుంది

ఇజ్రాయెల్ నుండి ఆయుధాలు కొనుగోలు చేసే దశ నుండి, కలిసి ఆయుధాలు తయారు చేసే దశకు భారత్ చేరుకుంది. డ్రోన్ టెక్నాలజీ, క్షిపణి వ్యవస్థలు మరియు నిఘా పరికరాల తయారీలో ఇజ్రాయెల్ భారత్‌కు ప్రధాన భాగస్వామిగా మారింది. ఉక్రెయిన్ మరియు గాజా యుద్ధాల నేపథ్యంలో, సంప్రదాయేతర భద్రతా సవాళ్లను ఎదుర్కోవడంలో ఇజ్రాయెల్ అనుభవం భారత్‌కు ఎంతో కీలకం.

ఒకప్పుడు ఇజ్రాయెల్ అంటే అరబ్ దేశాలకు శత్రువు. కానీ ఇప్పుడు సౌదీ అరేబియా, యూఏఈ వంటి దేశాలు కూడా ఇజ్రాయెల్‌తో చేతులు కలుపుతున్నాయి. ఈ మార్పులో భారత్ ఒక “వారధి” పాత్ర పోషిస్తోంది. అమెరికా వెనక్కి తగ్గుతున్న వేళ, పశ్చిమాసియాలో శాంతి మరియు స్థిరత్వం కోసం భారత్-ఇజ్రాయెల్-అరబ్ దేశాల కూటమి ఒక కొత్త ప్రత్యామ్నాయంగా ఎదుగుతోంది.

ఓ లుక్కేయండి

తాజా వార్తలు

Join WhatsApp Channel