Summer Special Trains: వేసవిలో 9,111 అదనపు సర్వీసులు: రైల్వే శాఖ

Photo of author

Eevela_Team

Share this Article

రాబోయే వేసవి రద్దీని తట్టుకునేదుకు రైల్వేశాఖ దేశవ్యాప్తంగా 9,111 అదనపు సర్వీసులు నడపనున్నట్లు ప్రకటించింది. గత ఏడాదితో పోలిస్తే ఇది 43 శాతం అధికం. గత ఏడాది వేసవిలో మొత్తం 6,369 అదనపు ట్రిప్పులు నడిపింది రైల్వే శాఖ.

ఆ శాంశంపై ఈరోజు రైల్వే శాఖ ఒక ప్రకటన జారీ చేసింది. ‘‘గత ఏడాది వేసవిలో మొత్తం 6,369 అదనపు ట్రిప్పులు నడిపాం. ఈసారి ఆ సంఖ్యను 9111కు పెంచాం. వీలైనంత ఎక్కువ మంది ప్రయాణికులు తాము కోరుకున్న గమ్యస్థానాలకు సులభంగా చేరుకునేలా అవసరమైన చర్యలు తీసుకునే విషయంలో రైల్వేశాఖ నిబద్ధతకు ఇది నిదర్శనం’’ అని ఆ ప్రకటనలో పేర్కొంది. ఒకవేళ డిమాండ్ పెరిగితే మరిన్ని రైళ్లు, ట్రిప్పులను పెంచుతామని వెల్లడించింది. ప్రయాణికుల భద్రత, తాగునీటి లభ్యత, రద్దీ నియంత్రణ చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులను ఆదేశించింది.

 

Join WhatsApp Channel
Join WhatsApp Channel