పాకిస్తాన్, పాక్ ఆక్రమిత కాశ్మీర్ లోని ఉగ్రవాద శిబిరాలే లక్ష్యంగా భారత వైమానిక దళం మెరుపుదాడి చేసింది. ఈ దాడిలో పలు ఉగ్రవాద శిబిరాల ధ్వంసంతో పాటూ దాదాపు 80 మంది ఉగ్రవాదులు మరణించినట్లు సమాచారం.
ఖచ్చితమైన సమాచారంతో భారత ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీ ఈ సంయుక్త ఆపరేషన్ చేపట్టాయి. పలు ఆయుధాలు, డ్రోన్లు ఉపయోగిందారు. ఈరోజు ఉదయం 10 గంటలకు ఆర్మీ మీడియా సమావేశం ఏర్పాటు చేసింది.