26.2 C
Hyderabad
Wednesday, February 4, 2026
HomeAndhra PradeshAP Elections 2024: న్యూస్ ఎరెనా తాజా ప్రీ-పోల్‌ సర్వే.. ఈ పార్టీదే అధికారం!

AP Elections 2024: న్యూస్ ఎరెనా తాజా ప్రీ-పోల్‌ సర్వే.. ఈ పార్టీదే అధికారం!

ప్రతిష్టాత్మక న్యూస్ ఎరెనా ఇండియా సంస్థ ఆంధ్రప్రదేశ్ ఎన్నికలపై తాజాగా తన ప్రీ-పోల్‌ సర్వే ఫలితాలను విడుదల చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 88 వేల 700 మందిని సర్వే చేసిన ఫలితాలు ఈరోజు వెల్లడించింది.

ఈ సంస్థ చెప్పిన దాని ప్రకారం, వరుసగా రెండోసారి సీఎం పదవిని జగన్‌ అధిష్టించడం ఖాయమేనని తేల్చి చెప్పింది. 49.4 శాతం ఓట్లతో వైసీపీ 122 స్థానాలను గెలుచుకుంటుందని స్పష్టం చేసింది. ఇక తెలుగుదేశం, జనసేన కూటమి 44.34 ఓటింగ్‌ శాతంతో 53 స్థానాలకు పరిమితమవుతుందని అంచనా వేసింది. బిజెపి, కాంగ్రెస్ లకు ఏపీలో స్థానమే లేదని తేల్చి చెప్పింది.

ఇప్పటికే అభ్యర్ధుల ఎంపికలో, ప్రచారంలో దూసుకుపోతున్న జగన్ పార్టీ ముందు ముందు రాబోయే సర్వేలలో ఎలా ఫలితాలు సాధిస్తుందో వేచి చూడాలి మరి.

Andhra Pradesh Pre-Poll Survey by Elecsense

YSRCP : 122 (49.4%)
TDP + JS : 53 (44.34%)
BJP : 0 (0.56%)
INC : 0 (1.21%)
OTH : 0 (4.75%)

Sample Size : 88,700

It seems Jagan Reddy will retain power and both the national parties will continue their humiliating streak in state.

— News Arena India (@NewsArenaIndia) February 1, 2024

ఓ లుక్కేయండి

తాజా వార్తలు

Join WhatsApp Channel