28.2 C
Hyderabad
Thursday, February 12, 2026
HometrendingTamil Nadu Tragedy: కల్తీ మద్యం త్రాగి 34 మంది మృతి .. 100 మంది...

Tamil Nadu Tragedy: కల్తీ మద్యం త్రాగి 34 మంది మృతి .. 100 మంది పైగా ఆస్పత్రుల్లో ..

 

తమిళనాడులోని కళ్లకురిచి జిల్లాలో అక్రమ మద్యం సేవించడం వల్ల మరణించిన వారి సంఖ్య 34కి చేరుకుంది, సుమారు 100 మంది ఆసుపత్రి పాలయ్యారు, వీరిలో ఐదుగురి పరిస్థితి గురువారం ఉదయం నాటికి విషమంగా ఉంది. 

మృతుల్లో ఇద్దరు మహిళలు, ఓ ట్రాన్స్‌జెండర్‌ ఉన్నారు. బుధవారం రాత్రి పలువురు మృతి చెందగా, మరో 60 మందికి పైగా ప్రస్తుతం వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు.

కల్తీ మద్యం సేవించి ప్రభావితమైన వారిలో ఎక్కువ మంది కళ్లకురిచ్చిలోని కరుణాపురంకు చెందినవారే కావడం గమనార్హం.

బాధిత వ్యక్తులపై లక్షణాలు బుధవారం కనిపించడం ప్రారంభించాయి, 

కళ్లకురిచ్చి ప్రభుత్వ వైద్య కళాశాల మరియు ఆసుపత్రితో పాటు సేలం, విల్లుపురంలోని ఆసుపత్రులు మరియు పుదుచ్చేరిలోని జవహర్‌లాల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ (జిప్‌మర్)లలో చేరారు.

ఎఐఎడిఎంకె ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి కె పళనిస్వామి గురువారం నాడు కల్లకురిచి హూచ్ దుర్ఘటనలో అనేక మంది ప్రాణాలను బలిగొన్న నేపథ్యంలో ముఖ్యమంత్రి ఎంకె స్టాలిన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.

కల్తీ మద్యం ఉత్పత్తి, విక్రయాలను నియంత్రించడంలో డీఎంకే ప్రభుత్వం విఫలమైందని రాజకీయ పార్టీలు విమర్శించాయి. బీజేపీ రాష్ట్ర శాఖ శనివారం రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు ప్రకటించింది.

ఓ లుక్కేయండి

తాజా వార్తలు

Join WhatsApp Channel