భారతీయుడిని ఆన్లైన్ లో పెళ్ళాడిన పాక్ యువతి, ఎందుకంటే?

Photo of author

Eevela_Team

Share this Article

ఈ నెల 2 తేదీన, కరాచీకి చెందిన అమీనా భారత్ కు చెందిన అర్బాజ్ ఖాన్‌ ఆన్లైన్ లో వివాహం చేసుకున్నారు.

జోధ్‌పూర్‌ కు చెందిన చార్టర్డ్ అకౌంటెంట్ అయిన అర్బాజ్ ఖాన్ మరియు కరాచీ వాసి అమీనా ల వివాహం బుధవారం నాడు నగరంలోని ఓస్వాల్ సమాజ్ భవన్‌లో తన స్నేహితులు మరియు కుటుంబ సభ్యుల సమక్షంలో సోషల్ మీడియా వేదికగా జరిగింది. ఇది సాధారణ వివాహంలాగా ఒక వేడుకలా సాగింది. ఇరు వేదికల్లో హాజరైన అనేక మంది ఈ దంపతులను ఆశీర్వదించారు.

పెళ్ళికొడుకు అర్బాజ్ బుధవారం వేడుక తర్వాత మాట్లాడుతూ, అమీనా వీసా కోసం దరఖాస్తు చేసుకుంది అని, ఆ వీసా ఆలస్యం అవుతుండడంతో అనుకున్న ముహూర్తానికి ఇలా వివాహం జరిగింది అని చెప్పాడు. నేను పాకిస్తాన్ లో వివాహం చేసుకుంటే అది మన దేశంలో గుర్తించబడదు కనుక ఆమె భారత్ కి వచ్చాక మరోసారి వివాహం చేసుకోవాలని నిర్ణయించినట్లు తెలిపాడు.

ఈ వివాహం ప్రేమ వివాహం కాదు అని, పెద్దలు నిర్ణయించిన పెళ్లి అని, ఇరు దేశాల సంబంధాలు సరిగా లేకపోవడంతో ఇలా ఆన్‌లైన్‌లో చేసుకోవాల్సి వచ్చింది అని అర్బాజ్ చెప్పాడు.

అమీనా త్వరలో వీసా పొంది భారత్‌కు వస్తుందని అతను ఆశిస్తున్నాడు.

Join WhatsApp Channel
Join WhatsApp Channel