మెగాస్టార్ చిరంజీవి ఇంట్లో పండగ వాతావరణం నెలకొంది. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ మరియు ఆయన సతీమణి ఉపాసన కొణిదెల కవల పిల్లలకు (ఒక బాబు మరియు ఒక పాప) జన్మనిచ్చారు. ఈ సంతోషకరమైన వార్తను స్వయంగా మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు.
గత కొంతకాలంగా మెగా వారసుడి కోసం ఎదురుచూస్తున్న అభిమానులకు ఇది ఊహించని పెద్ద సర్ప్రైజ్. హైదరాబాద్లోని అపోలో ఆసుపత్రిలో ఉపాసన ఈ రోజు ఉదయం కవలలకు జన్మనిచ్చారు. తల్లి మరియు పిల్లలు ఇద్దరూ క్షేమంగా ఉన్నట్లు వైద్యులు వెల్లడించారు.
తాతయ్య ఆనందం:
మనవడు, మనవరాలు ఇద్దరూ ఒకేసారి పుట్టడంతో చిరంజీవి ఆనందానికి అవధులు లేవు. “మా ఇంట్లోకి ఇద్దరు కవలలు అడుగుపెట్టారు, ఇది మా కుటుంబానికి దేవుడు ఇచ్చిన అతిపెద్ద వరం.. తల్లీ బిడ్డలు క్షేమం” అంటూ ఆయన భావోద్వేగానికి లోనయ్యారు. ఈ వార్త తెలిసిన వెంటనే మెగా అభిమానులు సోషల్ మీడియాలో శుభాకాంక్షల వర్షం కురిపిస్తున్నారు.
With immense joy and a heart full of gratitude, we are happy to share that @AlwaysRamCharan and @upasanakonidela have been blessed with twins – a baby boy and a baby girl.
— Chiranjeevi Konidela (@KChiruTweets) January 31, 2026
Both the babies and the mother are healthy and doing well. ✨
Welcoming these little ones into our family…

