Sjoerd Marijne: భారత మహిళల హాకీ జట్టు చీఫ్ కోచ్‌గా స్జోర్డ్ మారిజ్ తిరిగి నియామకం

టోక్యో ఒలింపిక్స్‌లో భారత మహిళల జట్టు అద్భుత ప్రదర్శనకు కారకుడైన డచ్ కోచ్ స్జోర్డ్ మారిజ్ (Sjoerd Marijne) మళ్లీ చీఫ్ కోచ్‌గా బాధ్యతలు చేపట్టనున్నారు.  భారత ...

టోక్యో ఒలింపిక్స్‌లో భారత మహిళల జట్టు అద్భుత ప్రదర్శనకు కారకుడైన డచ్ కోచ్ స్జోర్డ్ మారిజ్ (Sjoerd Marijne) మళ్లీ చీఫ్ కోచ్‌గా బాధ్యతలు చేపట్టనున్నారు. 

భారత మహిళల హాకీ జట్టు ప్రధాన కోచ్‌గా ఉన్న హరేంద్ర సింగ్ గత నెలలో వ్యక్తిగత కారణాలతో రాజీనామా చేయడంతో ఈ పదవి ఖాళీ అయింది. హరేంద్ర సింగ్ హయాంలో జట్టు ఆశించిన స్థాయిలో రాణించకపోవడం, ముఖ్యంగా ఎఫ్‌ఐహెచ్ ప్రో లీగ్‌లో పేలవ ప్రదర్శన నేపథ్యంలో ఈ మార్పు అనివార్యమైంది. ఈ క్రమంలో, జట్టును మళ్లీ గాడిలో పెట్టేందుకు అనుభవజ్ఞుడైన మారిజ్ వైపు హాకీ ఇండియా మొగ్గు చూపింది.

సుమారు నాలుగేళ్ల విరామం తర్వాత తిరిగి భారత జట్టుతో చేరడంపై స్జోర్డ్ మారిజ్ హర్షం వ్యక్తం చేశారు. ఆయన మాట్లాడుతూ, “మళ్ళీ భారత జట్టుకు సేవ చేయడం సంతోషంగా ఉంది. గత 4.5 ఏళ్లుగా నేను పొందిన అనుభవంతో, సరికొత్త ఉత్సాహంతో మరియు స్పష్టమైన దార్శనికతతో తిరిగి వస్తున్నాను. భారత క్రీడాకారిణులు ప్రపంచ వేదికపై తమ పూర్తి సామర్థ్యాన్ని చాటుకునేలా చేయడమే నా లక్ష్యం” అని పేర్కొన్నారు.

Join WhatsApp Channel