20.7 C
Hyderabad
Monday, February 16, 2026
HomePoliticsJanasena: జనసేన క్రియాశీలక సభ్యత్వ నమోదు షురూ

Janasena: జనసేన క్రియాశీలక సభ్యత్వ నమోదు షురూ

జనసేన పార్టీని క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేసే దిశగా 2026 సంవత్సరానికి సంబంధించిన క్రియాశీలక సభ్యత్వ నమోదు (Active Membership Registration) కార్యక్రమానికి ఆ పార్టీ శ్రీకారం చుట్టింది. పార్టీ అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ ఆదేశాల మేరకు రాష్ట్రవ్యాప్తంగా ఈ ప్రక్రియ ప్రారంభమైంది.

క్రియాశీలక సభ్యత్వం తీసుకున్న వారికి రూ.5 లక్షల ప్రమాద బీమా (Accident Insurance) వర్తిస్తుంది. దురదృష్టవశాత్తు ప్రమాదవశాత్తు మరణించినా లేదా శాశ్వత అంగవైకల్యం సంభవించినా బాధిత కుటుంబానికి ఈ మొత్తం అందుతుంది.

సభ్యత్వం తీసుకోవాలనుకునే వారు రూ.500 రుసుము చెల్లించి నమోదు చేసుకోవచ్చు. జనసేన పార్టీ అధికారిక వెబ్‌సైట్‌ ద్వారా లేదా స్థానిక పార్టీ నాయకుల సహకారంతో సభ్యత్వాన్ని పొందే వెసులుబాటు కల్పించారు.

ఓ లుక్కేయండి

తాజా వార్తలు

Join WhatsApp Channel