కాంగ్రెస్, టిడిపి కలిసి పనిచేస్తాయి: పొంగులేటి

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో టిడిపి చేసిన సాయానికి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు కాంగ్రెస్ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి థాంక్స్ చెప్పారు. 119 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ నాయకులు ఆదమరిచి నిద్రపోయారేమో కానీ టీడీపీ వారు మాత్రం నిద్రపోకుండా పనిచేశారని ప్రశంసించారు. ప్రస్తుతం టిడిపి, కాంగ్రెస్ వేరు కాదు అని రెండు ఒకటేనని చెప్పారు. టిడిపి అధికారంలో లేదని ఎవరూ బాధ పడొద్దని సూచించారు. టిడిపోళ్లు చేసిన సాయాన్ని ఎప్పటికీ మర్చిపోము అని, భవిష్యత్తు రాజకీయాల్లో కలిసి పని చేద్దామని పొంగులేటి పిలుపునిచ్చారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో చాలా చోట్ల కాంగ్రెస్ అభ్యర్థులకు టిడిపి నేతలు మద్దతు పలికినట్టు టిడిపి వర్గాలు పేర్కొన్నాయి.

Related posts

Janasena: జనసేన క్రియాశీలక సభ్యత్వ నమోదు షురూ

TIMS Sanathnagar: ఉగాదికి ప్రారంభం కానున్న సనత్‌నగర్ టిమ్స్

Yumnam Khemchand Singh: మణిపూర్‌ నూతన ముఖ్యమంత్రిగా ఖేమ్‌చంద్‌ సింగ్‌ ప్రమాణస్వీకారం