Upendra Dwivedi: ఆర్మీ కొత్త చీఫ్‌గా లెఫ్టినెంట్ జనరల్ ఉపేంద్ర ద్వివేది నియామాకం

 

ఆర్మీ కొత్త చీఫ్‌గా లెఫ్టినెంట్ జనరల్ ఉపేంద్ర ద్వివేదీ నియమితులయ్యారు.
ప్రస్తుత సైన్యాధిపతి లెఫ్టినెంట్ జనరల్ మనోజ్ సి పాండే పదవీకాలం జూన్ 30తో
ముగియనుంది. రెండేళ్ల కిందట 2022 ఏప్రిల్ 30 ఆర్మీ చీఫ్‌గా బాధ్యతలు
చేపట్టిన పాండే పదవీకాలం మే 31తో ముగియగా.. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో నెల
రోజుల పాటు పొడిగించారు. దీంతో ఆర్మీకి కొత్త చీఫ్‌ ఎంపిక అనివార్యమైంది.
సీనియార్టీ ఆధారంగా వైస్ చీఫ్‌గా ఉన్న లెఫ్టినెంట్ జనరల్ ద్వివేదీని కేంద్ర
ప్రభుత్వం ఎంపిక చేసింది. 

జూలై
01, 1964న జన్మించిన లెఫ్టినెంట్ (లెఫ్టినెంట్) జనరల్ ఉపేంద్ర ద్వివేది
డిసెంబరు 15, 1984న భారత సైన్యంలోని పదాతిదళం (జమ్మూ & కాశ్మీర్
రైఫిల్స్)లో నియమితుడయ్యారు. దాదాపు 40 సంవత్సరాల పాటు సుదీర్ఘమైన మరియు
విశిష్టమైన సేవలో ఆయన పనిచేశారు.లెఫ్టినెంట్ జనరల్ ద్వివేది కమాండ్ ఆఫ్ రెజిమెంట్ (18 జమ్మూ & కాశ్మీర్ రైఫిల్స్),
బ్రిగేడ్ (26 సెక్టార్ అస్సాం రైఫిల్స్), ఇన్‌స్పెక్టర్ జనరల్, అస్సాం
రైఫిల్స్ (తూర్పు) మరియు 9 కార్ప్స్  లలో పని చేశారు. 


Related posts

దేశ ప్రతిష్టను దిగజారు స్తున్నారు: రాహుల్ గాంధీపై సింధియా ధ్వజం

వందేభారత్ ప్రయాణికులకు గుడ్ న్యూస్: స్లీపర్, అమృత్ భారత్ రైళ్లలో ‘ఎమర్జెన్సీ కోటా’ పునరుద్ధరణ.. !

భారత్-అమెరికా డీల్‌తో బంగ్లాదేశ్ తరహాలోనే భారత వస్త్రాలకూ ‘జీరో డ్యూటీ’:  పియూష్ గోయల్ వెల్లడి