Summer Special Trains: వేసవిలో 9,111 అదనపు సర్వీసులు: రైల్వే శాఖ

రాబోయే వేసవి రద్దీని తట్టుకునేదుకు రైల్వేశాఖ దేశవ్యాప్తంగా 9,111 అదనపు సర్వీసులు నడపనున్నట్లు ప్రకటించింది. గత ఏడాదితో పోలిస్తే ఇది 43 శాతం అధికం. గత ఏడాది వేసవిలో మొత్తం 6,369 అదనపు ట్రిప్పులు నడిపింది రైల్వే శాఖ.

ఆ శాంశంపై ఈరోజు రైల్వే శాఖ ఒక ప్రకటన జారీ చేసింది. ‘‘గత ఏడాది వేసవిలో మొత్తం 6,369 అదనపు ట్రిప్పులు నడిపాం. ఈసారి ఆ సంఖ్యను 9111కు పెంచాం. వీలైనంత ఎక్కువ మంది ప్రయాణికులు తాము కోరుకున్న గమ్యస్థానాలకు సులభంగా చేరుకునేలా అవసరమైన చర్యలు తీసుకునే విషయంలో రైల్వేశాఖ నిబద్ధతకు ఇది నిదర్శనం’’ అని ఆ ప్రకటనలో పేర్కొంది. ఒకవేళ డిమాండ్ పెరిగితే మరిన్ని రైళ్లు, ట్రిప్పులను పెంచుతామని వెల్లడించింది. ప్రయాణికుల భద్రత, తాగునీటి లభ్యత, రద్దీ నియంత్రణ చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులను ఆదేశించింది.

 

Related posts

దేశ ప్రతిష్టను దిగజారు స్తున్నారు: రాహుల్ గాంధీపై సింధియా ధ్వజం

వందేభారత్ ప్రయాణికులకు గుడ్ న్యూస్: స్లీపర్, అమృత్ భారత్ రైళ్లలో ‘ఎమర్జెన్సీ కోటా’ పునరుద్ధరణ.. !

భారత్-అమెరికా డీల్‌తో బంగ్లాదేశ్ తరహాలోనే భారత వస్త్రాలకూ ‘జీరో డ్యూటీ’:  పియూష్ గోయల్ వెల్లడి