సంక్రాంతి సందడి 2026: పతంగుల పండుగకు ముస్తాబవుతున్న భాగ్యనగరం.. పర్యాటక శాఖ భారీ ఏర్పాట్లు!

kite festival

హైదరాబాద్: మకర సంక్రాంతి పండుగకు ఇంకా మూడు వారాల సమయం ఉన్నప్పటికీ, భాగ్యనగరంలో పండుగ వాతావరణం అప్పుడే మొదలైంది. రంగురంగుల పతంగులు, చురుకైన మాంజాలతో హైదరాబాద్ గగనతలం ముస్తాబవుతోంది. ఈ ఏడాది సంక్రాంతి వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించేందుకు తెలంగాణ ప్రభుత్వం మరియు పర్యాటక శాఖ సిద్ధమవుతున్నాయి.

సికింద్రాబాద్‌లోని పరేడ్ గ్రౌండ్స్‌లో జనవరి 13 నుండి 15 వరకు అంతర్జాతీయ పతంగుల పండుగ నిర్వహించనున్నారు. సోమవారం (డిసెంబర్ 22, 2025) నాడు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణారావు నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఈ వేడుకలపై కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈసారి కేవలం పతంగులే కాకుండా, నగరం చుట్టూ హాట్ ఎయిర్ బెలూన్ల (Hot Air Balloon) ఉత్సవం, దేశవ్యాప్తంగా ఉన్న డ్రోన్ పైలట్లతో డ్రోన్ ఫెస్టివల్‌ను కూడా నిర్వహించనున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచనల మేరకు, ‘హైడ్రా’ (HYDRAA) ద్వారా పునరుద్ధరించబడిన చెరువుల వద్ద కూడా ఈ వేడుకలను నిర్వహించి, నగర పర్యావరణ పరిరక్షణను చాటిచెప్పాలని ప్రభుత్వం నిర్ణయించింది.

ఇదిలావుండగా ధూల్‌పేట్, బేగంబజార్, గుల్జార్ హౌజ్, మంగళ్‌హాట్ ప్రాంతాలు పతంగుల అమ్మకాలతో కిటకిటలాడుతున్నాయి. సాధారణ పేపర్ పతంగులు ₹7 నుండి ₹30 వరకు పలుకుతుండగా, ఫ్యాన్సీ మరియు పెద్ద సైజు పతంగులు ₹300 నుండి ₹800 వరకు అందుబాటులో ఉన్నాయి. ఈసారి సినిమా తారలు, కార్టూన్ పాత్రలు, మరియు రాజకీయ నాయకుల చిత్రాలతో కూడిన పతంగులకు విపరీతమైన డిమాండ్ ఉంది. వెండి మరియు బంగారు పూత పూసిన చిన్న పతంగులను గిఫ్ట్ ప్యాక్‌లుగా విక్రయిస్తున్నారు, వీటి ధర ₹200 నుండి ₹850 వరకు ఉంది.

Related posts

TIMS Sanathnagar: ఉగాదికి ప్రారంభం కానున్న సనత్‌నగర్ టిమ్స్

Pariksha Pe Charcha 2026: విద్యార్ధులతో ప్రధాని మోదీ ముఖాముఖి లైవ్

Padma Awards 2026: 131 మందికి పద్మ అవార్డులు, తెలుగువారు 11 మంది… మొత్తం లిస్టు ఇదే